ADB: ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తుందని, పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా డాల్డాకంపెనీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు.