BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు క్రిస్మస్ సందర్భంగా బుధవారం పలు చర్చిల్లో జరిగే క్రిస్మస్ వేడుకలో పాల్గొంటారు. కొత్తగూడెం, పాల్వంచ, రామవరం, రుద్రంపూర్ ప్రాంతాల్లోని సీఎస్ఐ చర్చిల్లో జరిగే క్రిస్మస్ వేడుకలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మార్వో ఆఫీస్ బేతస్థ ప్రేయర్ హాల్కు హాజరవుతారని చెప్పారు.