MBNR: మహబూబ్ నగర్ రూరల్ మండలం రామచంద్రాపురం వాగులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. ఎన్నిసార్లు మైనింగ్ అధికారులకు మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఈ తవ్వకాల ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.