MDK: రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే పంటకు కనీస మద్దతు ధర లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ పాల్గొన్నారు.