KMM: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు కేటాయించాలని KGKS రాష్ట్ర అధ్యక్షులు ఎం. వి రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా సంఘం కార్యాలయంలో బొడపట్ల సుదర్శన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికులకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుందన్నారు.