BDK: ఇల్లందు నుంచి నర్సంపేట వరకు పల్లె వెలుగు సర్వీస్ను కొత్తగూడెం మరియు ఇల్లందు డిపో మేనేజర్ S. రాజ్యలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సర్వీస్ ప్రతిరోజు రెండు ట్రిప్పులు తిరుగుతుందని ఉదయం 7:00 గంటలకు మరియు 11:45 నిమిషాలకు ఉంటుంది. కనుక ఇల్లందు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని డిపో మేనేజర్ తెలియజేశారు.