NZB: అంబేడ్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని రైల్వే కమాన్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట అమిత్షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్, గ్రంథాలయ ఛైర్మన్ పాల్గొన్నారు.