ADB: జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అహ్మద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరవీరుల పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు.