MBNR: సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో ఆమె మాట్లాడి శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ తేజ తండ్రి రమేష్ను ఆమె పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు అరుణ తెలిపారు.