GDWL: 99 రోజులు..10 సూత్రాలు.. గద్వాల పట్టణ సమగ్రాభివృద్ధే మన లక్ష్యం అని మున్సిపల్ ఛైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని 30వ వార్డులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను ఆమె శ్రీకారం చుట్టారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం పట్టణ రూపురేఖలను మార్చడానికి ఒక పునాది కావాలన్నారు.