కామారెడ్డి: నాగిరెడ్డిపేట్లో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్రావు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందిస్తూ రూ.55 లక్షల అంచనా వ్యయంతో టెండర్కు పిలిచింది. దీంతో నాగిరెడ్డిపేట్ బస్టాండ్ సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు.