HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణములో గల శ్రీ గణేశ ఆలయంలో రేపు సా.6 గం.లకు గణపతి హోమం, గణపతికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. సంకటహర చతుర్థి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమములో పాల్గొని భక్తులు గణపతి ఆశీస్సులు పొందాలని సూచించారు.