NGKL: పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం మేడిపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి శనివారం ఎమ్మెల్యే హాజరై, ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.