SRCL: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావులోని క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ ఎప్పటికీ స్పూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. చంద్రయాన్ సందర్భంగా వారితో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రామోజీరావు వర్ధంతి సందర్భంగా మంత్రి సిరిసిల్లలో రామోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.