MDK: నర్సాపూర్ పట్టణంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్ దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.