NLG: విజయ దశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్లో శ్రీ తుల్జా భవాని మాత ఆలయాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజక వర్గ ప్రాంత ప్రజలపై ఉండి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇందులో స్థానిక నాయకులు పాల్గొన్నారు.