KMM: మధిర సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసు కుటుంబ సభ్యులందరూ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐపీఎస్ అధికారి రిత్విక్ సాయి కోరారు. శనివారం మధిర సీ.ఐ కార్యాలయంలో ఖమ్మంకు చెందిన శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఉచితంగా ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.