నాగర్కర్నూల్ లోక్సభ సభ్యుడు మల్లు రవికి బుధవారం ఢిల్లీలో మరో కీలక బాధ్యత దక్కింది. ఆయనను పరిశ్రమల వ్యవహారాల పరిశీలన కమిటీ సభ్యుడిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల వ్యవహారాలను పర్య వేక్షించే పార్లమెంటరీ స్థాయి సంఘాలను పునర్వ్యవస్థీకరిస్తూ స్పీకర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.