ASF: హైదరాబాద్ సరూర్ నగర్లో ఈనెల 23న తలపెట్టిన మాలల రణభేరి మహాసభకు తరలిరావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షురాలు విజయ ఆధ్వర్యంలో నిన్న రెబ్బెన మండల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రణభేరి వాల్ పోస్టర్లను విడుదల చేశారు.