NRML: కలెక్టరేట్లో జాతీయ గేయం వందేమాతరం రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సామూహిక ఆలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ అభిలాషా అభినవ్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్తో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వందేమాతరం స్వాతంత్ర్య ఉద్యమంలో సమర యోధులకు స్పూర్తినిచ్చిన గేయమని అన్నారు.