WGL: చేర్యాల పట్టణ కేంద్రంలో గంజాయిని విక్రయిస్తున్న నలుగురు యువకులను చేర్యాల పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ శ్రీను, ఎస్సై నీరేష్ తెలిపారు. చేర్యాల మండలానికి చెందిన యువకులు చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారన్నారు. వారి అవసరాలకు ధూల్ పేట నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.