మేడ్చల్: జిల్లాలో యువ వికాసం పథకం కోసం 66,648 దరఖాస్తులు చేసుకోగా ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల వారిగా 24,610 యూనిట్లను మంజూరు చేసింది. తదుపరి విధివిధానాలను అధికారులు రూపొందించారు. జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు యూనిట్లను అందించనున్నారు. అత్యధికంగా బీసీ సంక్షేమ శాఖ కింద 13,400 యూనిట్లు మంజూరు అయ్యాయి.