SRD: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. ఉ. 9 గంటలకు గుమ్మడిదలలో సీసీ రోడ్లు, యూజీడీ పనులు, జిన్నారం మండలం వావిలాలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం జర్నలిస్టు కాలనీలో యూజీడీ పనులకు శంకుస్థాపన చేస్తారు.