జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో శ్రీమడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజేంగి నందయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాల నిర్మాణం గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.