KMM: దేశానికి కమ్యూనిస్టులే ఆదర్శం అని సీపీఐ జాతీయ నేత బాగం హేమంతరావు అన్నారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా మంగళవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వందేళ్ల ఉద్యమ పార్టీగా సీపీఐ ఖ్యాతి పొందిందన్నారు. పేద ప్రజలు, కార్మికుల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేసి అప్పటి ప్రభుత్వాల మెడలు వంచి, వారి సమస్యలు పరిష్కరించిందన్నారు.