NGKL: రెడీక్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ రక్తదాన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి డీఎంహెచ్వో డా. రవి కుమార్ నాయక్ రక్తదాతలను సన్మానించారు. రక్తదానం మహత్తరమైన మానవతాసేవ అని, మరొకరి ప్రాణాన్ని కాపాడటం కంటే గొప్పసేవ లేదన్నారు. రక్తాన్ని తయారు చేయలేమని, రక్తదాతలే నిజమైన దేవుళ్లని పేర్కొన్నారు.