KNR: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మంగళవారం హైనా దాడిలో గైని చంద్రమౌళికి చెందిన దూడ మృతి చెందింది. రైతు చంద్రమౌళి ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపగా, బీట్ ఆఫీసర్ SK సమీనా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. హైనా దాడి కారణంగానే దూడ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.