MLG: మంగపేట మండలం లక్ష్మీ నరసాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగులమ్మ జాతరలో రెండవరోజు ముఖ్య ఘట్టం మొదలైంది. ఆదివాసీ పూజారులు గండోర్రె గుట్ట, ఎర్రెట్టల గుట్టల నుండి నాగులమ్మ, సడాలమ్మలను డోలు సన్నాయి వాయిద్యాల మధ్య ప్రత్యేక పూజలతో తీసుకొచ్చారు. ఆదివాసి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎదుర్కోలు నిర్వహించి, అభిషేకాలు నిర్వహించి, గద్దెలపై ప్రతిష్టించారు.