HYD: ఆక్రమణలకు గురైన వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకోవాలని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన ఆస్తులను కాపాడాలని జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఖాలిద్ ముబషీర్ జఫర్ అన్నారు. శుక్రవారం చట్టబజార్లో కార్యదర్శి అబ్దుల్ హకీంతో కలిసి మాట్లాడారు. కులగణన ఆధారంగా జనాభా ప్రకారం ముస్లిం రిజర్వేషన్లు పెంచాలన్నారు.