SRD: సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిన్నారం ఎస్సై నాగలక్ష్మి అన్నారు. శనివారం జిన్నారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జీపీ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచితే తద్వారా సైబర్ నేరాలను నియంత్రించే అవకాశం ఉంటుందన్నారు. కార్యదర్శి మాణిక్యం, సిబ్బంది ఉన్నారు.