NLG: ఇవాళ నల్గొండ పురపాలికలోని 19వ వార్డు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నల్గొండలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిల సమక్షంలో సుమారు 200 మంది గులాబీ కండువా కప్పుకున్నారు.