ప్రకాశం: కొమరోలు మండలం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశానికి అంగన్వాడి కార్యకర్తలు కూడా హాజరుకావాలని కోరారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం పై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.