SKLM: రాగాల మూడు గంటల్లో శ్రీకాకుళం జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ రోణంకి కూర్మనాథ్ మంగళవారం తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.