నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామ స్థూపం మైదానంలో పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. సోమిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో అర్చకులు సత్కరించారు.