NZB: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రాజ రెడ్డి, తెలంగాణ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఛైర్మన్ హామి ఇచ్చారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ బి.సీతయ్యను ఇరువురు అభినందించారు.