HYD: దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ శబరిమలకు వెళ్లే పలు ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా జనవరి 24న వెళ్లాల్సిన మౌలాలి – కొట్టాయం(07167), జనవరి 25న కొట్టాయం – మౌలాలి(07168) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎలాంటి బుకింగ్స్ చేసుకోలేదని రద్దీ లేకపోవడంతోనే రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.