MDK: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో ప్రజా బాట కార్యక్రమం చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద పరిశుభ్రం చేస్తున్నట్లు, సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ఏడిఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.