KMR: బాన్సువాడ పట్టణంలోని శ్రీ సరస్వతి దేవి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పదొవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆయన సతీమణి సోనీ రెడ్డిలు సతి సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.