SDPT: హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. చెరువులో బోటులో ప్రయాణించి, అక్కడి అందాలను ఆస్వాదించిన ఆయన మహిళలు తయారు చేసిన సద్దుల బతుకమ్మలను సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో కాసేపు ముచ్చటించారు.