KMR: న్యాయవాది పరిషత్ కోశాధికారిగా కే. గంగరాజు ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల్లో రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన న్యాయవాది గంగరాజును ఎంపిక చేశారు. ఆయన మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అప్పగించినా పదవికి తగిన న్యాయం చేస్తానన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామి ఇచ్చారు.