SDPT: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలంలో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం సూచించిన పది అంశాల అమలు సహా పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాపత్రినిధులు పాల్గొన్నారు.