JGL: వెల్గటూర్ మండలం జగదేవ్పేట -చర్లపల్లి ప్రధాన రహదారి గుంతలు పడి నరకప్రాయంగా మారింది. రహదారిపై అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలు, రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలు పెరిగి ఇబ్బందిగా మారిందని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుపై గుంతలు పూడ్చి, రోడ్డుకి ఇరువైపులా పొదలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.