MNCL: కోటపల్లి మండలంలోని కొండంపేట, నాగంపేట, ఏసన్వాయి, ఏడగట్ట, పిన్నారం గ్రామాలలో అడవి పందుల దాడితో పత్తి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని శుక్రవారం అటవీ శాఖ అధికారి లావణ్యకు వినతిపత్రం అందజేశారు. అధికారులు వెంటనే స్పందించి పంట నష్టం పరిశీలించి తగిన పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.