MNCL: లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వెంకటేష్, ఉప సర్పంచ్ మధుకర్ల ఆధ్వర్యంలో కార్యాలయం ఆవరణలో పంచాయతీ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమైందన్నారు. గ్రామాన్ని అందరూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.