బాల్యం నుంచే ఎన్నో కష్టాలు.. కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించి.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని ఆసియా 2023 క్రీడల్లో పతకం సాధించాడు రాంబాబు. అంతేకాదు తన లాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.
ICC odi వరల్డ్ కప్ 2023కి ముందే ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ లభించింది. విరాట్ కోహ్లీ(virat Kohli) యాక్ట్ చేసిన ఓ సాంగ్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబ్ సింగర్ యష్రాజ్(Yashraj)ముఖాటే ఆలపించిన డ్యాన్స్ చేసిన వీడియోలో కోహ్లీ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
క్రికెటర్ శిఖర్ ధావన్కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. అతని భార్య మానసికంగా అతన్ని ఇబ్బంది పెట్టిందనే కారణాలను కోర్టు అంగీకరించింది.
ఆసియా క్రీడల్లో పీవీ సింధు(PV Sindhu) నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. చైనాకు చెందిన హీ బింగ్జియావో(He Bingjiao) చేతిలో ఓడిపోయి ఈవెంట్ నుంచి నిష్క్రమించింది.
ప్రపంచ కప్కు ముందే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దారుణమైన నిర్వహణ తీరు బట్టబయలైంది. ప్రేక్షకుల సీట్లపై అనేక చోట్ల పక్షుల రెట్టలు అలాగే ఉన్న ఓ వీడియో చూసిన నెటిజన్లు అధికారుల తీరుపై కామెంట్లు చేస్తున్నారు. ఇందులో అవినీతి జరిగిందని దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత క్రమశిక్షణతో జట్టును నడిపిస్తున్నాడో తెలపడానికి ఈ ఉదాహారణ చాలు అనిపిస్తుంది. గత 9 నెలలుగా అతడి ఫోన్లో ఆ రెండు పాపులర్ యాప్స్ లేవట. ఏదైనా పోస్ట్ చేయాలన్నా అది తన వైఫ్ చూసుకుంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ బిర్యానీపై పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్(Shadab Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ICC ప్రపంచ కప్ 2023కి ముందు హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ, చివరి వార్మప్ గేమ్లో మెన్ ఇన్ గ్రీన్ జట్టు ఓడిపోవడంతో ఈ కామెంట్లు చేశారు.
ఆసియా క్రీడలు 2023లో 11వ రోజు భారత్ పతకాల ఖాతాలోకి మరో స్వర్ణాన్ని చేర్చింది. అర్చరీ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నమ్, ప్రవీణ్ ఓజాస్ సంయుక్తంగా దక్షిణ కొరియాకు చెందిన జట్టను ఓడించి గోల్డ్ గెల్చుకున్నారు.
ఆసియా క్రిడాల్లో భారత్ సత్తా చాటుతుంది. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్లో బంగారు పతకం ఇండియాకు దక్కింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు భారత్ 14 పసిడి పతకాలను కైవసం చేసుకుంది.
ఆసియా క్రీడల్లో టీమిండియా సత్తా చాటింది. టీ20లో నేపాల్ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి సెమీస్కు చేరింది. భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ 49 బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.
ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగిస్తోంది. విత్యా రాంరాజ్ మహిళల 400 మీటర్ల హర్డిల్ రేసులో 55.42 స్కోరును నమోదు చేసి.. 1984 నాటి దిగ్గజ భారత అథ్లెట్ PT ఉష జాతీయ రికార్డును సమం చేసింది.