కొన్ని రోజుల క్రితం హీత్ స్ట్రీక్ మరణించినట్లు పుకార్లు వచ్చాయి. ఈ వార్తను జింబాబ్వే మాజీ క్రికెటర్ హెన్రీ ఒలాంగా అందించాడు. అయితే తరువాత ఒలంగా ఈ వార్తలను తప్పు అని.. హీత్ స్ట్రీక్ జీవించి ఉన్నాడని చెప్పాడు. అయితే ఈసారి జింబాబ్వే మాజీ కెప్టెన్ కన్నుమూసినట్లు అతని భార్య సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధృవీకరించింది.
మ్యాచ్ ప్రారంభం కాకముందే వర్షం కురిసి పాక్ ఇన్నింగ్స్ ఆడకముందే మ్యాచ్ ముగిసింది. భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే మళ్లీ వర్షం కురిసి చాలా సేపు నిలిచి మ్యాచ్ ఆడేందుకు పరిస్థితులు అనుకూలించక పోవడంతో మ్యాచ్ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు.
ఆసియా కప్కు ఎంపిక చేసిన 18 మంది సభ్యులతో కూడిన జట్టులో ముగ్గురు ఆటగాళ్లను తొలగించారు. ఆసియా కప్కు ఎంపికైన 18 మంది సభ్యుల జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ, ప్రముఖ ఫాస్ట్ బౌలర్ కృష్ణ, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్లు ప్రపంచకప్కు ఎంపిక కాలేదు.
వన్డే ఫార్మాట్లో 2019 ప్రపంచకప్ తర్వాత అంటే దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత దాయాది జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో అందరి చూపు ఇరు జట్లలోని కొందరు ఆటగాళ్లపైనే ఉంటుంది.
మ్యాచ్ కోసం భారత జట్టు హోటల్ నుంచి స్టేడియానికి చేరుకుంది. కానీ తాజా నివేదికల ప్రకారం, వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. పిచ్, దాని పరిసరాలు చాలా వరకు కప్పబడి ఉన్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
2023 ఆసియా కప్ మొదలైన తరువాత మొదటి సారి ఇండియా పాకిస్థాన్ రెండు పెద్ద జట్లు శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే క్యాండీ జిల్లాలో ఈ రోజు వర్ష సూచన ఉండడంతో అభిమానలు ఆందోళన చెందుతున్నారు.
జ్యూరిచ్ డైమండ్ లీగ్ 2023 పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా(Neeraj Chopra) కాస్తా తడబడినట్లు అనిపిస్తుంది. గతంలో మొదటి స్థానంలో నిలిచిన ఈ భారత అథ్లెట్..ఈసారి 85.71 మీటర్లతో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్రేక్ చేశాడు. ఆసియా కప్ టోర్నీలోని మొదటి మ్యాచ్లో పాక్ జట్టు విజయం సాధించింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 151 పరుగులు చేసి పలు రికార్డులను తిరగరాశాడు.
భారత అథ్లెట్ నీరజ్ చోప్రా మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన తర్వాత, అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెట్గా ప్రపంచ ఛాంపియన్గా నిలిచే నీరజ్ ప్రయాణం అంత సులభం కాదు. నీరజ్ తన ఫిట్నెస్ని ఎప్పటికప్పుడు ఎలా కాపాడుకుంటాడో ఓసారి చూద్దాం.
పాకిస్తాన్, నేపాల్ మధ్య మ్యాచ్ చూడటానికి చాలా తక్కువ మంది అభిమానులు ముల్తాన్ స్టేడియంకు వచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ జట్లు సెప్టెంబరు 2న తలపడనున్నాయి. పల్లెకెలె స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే భారత్-పాక్ మ్యాచ్పై వర్షం ప్రభావం చూపుతుందా? నిజానికి క్రికెట్ అభిమానులకు శుభవార్త ఏమీ లేదు.