నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య 25వ మ్యాచ్ మొదలైంది. టాస్ గెల్చిన బ్రిటిష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ జట్టులో ఓ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందో ఇప్పుడు చుద్దాం.
వరల్డ్ కప్లో మంచి ఊపు మీద ఉన్న రోహిత్ సేనకు షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సిరీస్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. చీలమండ గాయం ఎక్కువ అవడంతో సిరీస్కు దూరం కానున్నారు.
ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఆసీస్ ఆ తర్వాత వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది.
తన నుంచి ఇప్పటి వరకు 90 శాతం ఆటను మాత్రమే చూశారని టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ అంటున్నారు. ఐపీఎల్, వన్డే మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ సంచలనం.. వరల్డ్ కప్లో మాత్రం ఇప్పటివరకు భారీ ఇన్సింగ్స్ ఆడలేదు.
వన్డే ప్రపంచకప్లో దూసుకుపోతున్న భారత్ జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య టీమ్లో లేకపోయినా జట్టు బలంగానే ఉందన్నారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమ్కు ఎంతో అవసరం అన్నారు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరూ నిసర్గ పేరుతో కొత్త వెంచర్ను కూడా ప్రారంభించారు. విజయదశమి రోజు తమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ, అనుష్క శర్మ ప్రకటించారు.
ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. కోహ్లీ 95 పరుగులతో సెంచరీ మిస్ చేయడంతో అభిమానులు నిరాశ చెందారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ జట్టు టీమిండియా ముందు 274 పరుగుల టార్గెట్ను ఉంచింది.
వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ రికార్డును బ్రేక్ చేశాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మూడో స్థానానికి చేరాడు. వరల్డ్ కప్లల్లో ఇప్పటి వరకూ షమీ 32 వికెట్లు పడగొట్టి కుంబ్లే రికార్డును తిరగరాశాడు.