ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ యూఏఈతో టీమిండియా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, నిన్న టీమిండియాకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. అవసరం లేదనకుంటే హాజరు కాకుండా ఉండే అవకాశం ప్లేయర్లకు ఉంది. ఈ ప్రాక్టీస్కు సంజు శాంసన్, బుమ్రా వెళ్లలేదని సమాచారం. మరోవైపు అభిషేక్ శర్మ భారీగా సిక్సర్లతో విరుచుకుపడ్డాడని తెలుస్తుంది.