దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. సఫారీ స్పిన్నర్లను టీమిండియా బ్యాటర్లు ఎదుర్కొలేకపోయారు. దీనిపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. స్పిన్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్ల నైపుణ్యం తగ్గిందని విమర్శించాడు. ఇకపై స్పిన్కు బదులు సాంప్రదాయ పిచ్లు తయారు చేయాలని కోరాడు.