అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై తడబడుతోంది. తిలక్ వర్మ (39), సూర్యకుమార్ యాదవ్ (48) మినహా మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ముంబై 15 బంతుల్లో 68 పరుగులు రాబట్టాల్సి ఉంది.