టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ బ్రాడ్కాస్టర్స్కు చురకలంటించాడు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ప్రసారకర్తల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘నేను ఏం తింటున్నాను? నాకు ఇష్టమైన చోలే బటూరే ఢిల్లీలో ఎక్కడ దొరుకుతుంది? అనే విషయాలపై చర్చ అవసరం లేదు. దానికి బదులుగా ఒక అథ్లెట్గా ఏం చేస్తున్నా అనే దానిపై చర్చించవచ్చు’ అని పేర్కొన్నాడు.